కోడి పందేల బరులపై అదనపు ఎస్పీ దాడులు

ABN , First Publish Date - 2021-01-14T05:58:59+05:30 IST

కోడి పందేల బరులపై దాడులు చేసి 56 మందిపై కేసులు నమోదు చేసినట్లు కొవ్వూరు రూరల్‌ సీఐ ఎం. సురేష్‌ తెలిపారు.

కోడి పందేల బరులపై  అదనపు ఎస్పీ దాడులు

కొవ్వూరు,జనవరి 13: కోడి పందేల బరులపై దాడులు చేసి 56 మందిపై కేసులు నమోదు చేసినట్లు కొవ్వూరు రూరల్‌  సీఐ ఎం. సురేష్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి కొవ్వూరు రూరల్‌ సర్కిల్‌ పరిధిలోని కొవ్వూరు రూరల్‌, దేవరపల్లి, తాళ్లపూడి పోలీసుస్టేషన్‌ల పరిధిలో అడిషనల్‌ ఎస్పీ మహేష్‌, కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాధ్‌, కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐలతోపాటు దాడులు నిర్వహించి కోడి పందేలు ఆడుతున్న వారిపై 8 కేసులు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేసి 9వేల 600 రూపాయల నగదు, 16 కోడి పుంజులు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు.అదే విధంగా గుండాట ఆడేవారిపై దాడులు నిర్వహించి 5 కేసులు నమోదు చేసి 40 మందిని అరెస్టు చేసి 28 వేల 600 నగదు, 7 గుండాట బోర్డులు, వాటి సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.


Updated Date - 2021-01-14T05:58:59+05:30 IST