ఏఎస్పీకి ఆత్మీయ సత్కారం

ABN , First Publish Date - 2022-05-17T03:58:50+05:30 IST

కావలి డీఎస్పీగా పనిచేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొంది కర్నూల్‌కు బదిలీపై వెళ్లిన దేవరకొండ ప్రసాద్‌కు సోమవారం రాత్రి కావలిలో ఆత్మీయ సత్కారం జరిగింది.

ఏఎస్పీకి ఆత్మీయ సత్కారం
ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే, ఆర్డీవో, ఏఎస్పీ

కావలి, మే 16: కావలి డీఎస్పీగా పనిచేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొంది కర్నూల్‌కు బదిలీపై వెళ్లిన దేవరకొండ ప్రసాద్‌కు సోమవారం రాత్రి కావలిలో ఆత్మీయ సత్కారం జరిగింది. ఒకటో పట్టణ సీఐ కే.శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక బృందావనం హౌసింగ్‌ కాలనీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో శీనానాయక్‌, ఇన్‌చార్జి డీఎస్పీ కే.శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డి, పలువురు వైసీపీ నాయకలు, బీజేపీ నాయకులు పాల్గొని ఏఎస్పీ ప్రసాద్‌ను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T03:58:50+05:30 IST