లాఅండ్ఆర్డర్ ఏఎస్పీగా ఎం.రజనీ
ABN , First Publish Date - 2022-05-23T06:52:08+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీగా ఎం.రజనీ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
రాజమహేంద్రవరం, మే 22(ఆంధ్రజ్యోతి) : తూర్పుగోదావరి జిల్లా లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీగా ఎం.రజనీ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిస్థితులను అవగాహన చేసుకుని, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే పనులపై దృష్టి సారించి అరికట్టడానికి ప్రయత్నిస్తామన్నారు.