ఉన్మాదిగా మారిన కుమారుడు! మంచి చెప్పిన తండ్రిని దారుణంగా..

ABN , First Publish Date - 2020-10-19T18:14:32+05:30 IST

పబ్‌జీ ఆటకు బానిసైన ఓ టీనేజర్ ఉన్నాదిగా మారాడు. కన్న తండ్రిపై దాడి చేసి ఆయన గొంతు కోశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలోని జమునానగర్ ప్రాంతంలో గురువారం నాడు ఈ దారుణం జరిగింది.

ఉన్మాదిగా మారిన కుమారుడు! మంచి చెప్పిన తండ్రిని దారుణంగా..

మీరట్: పబ్‌జీ ఆటకు బానిసైన ఓ టీనేజర్ ఉన్నాదిగా మారాడు. కన్న తండ్రిపై దాడి చేసి ఆయన గొంతు కోశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలోని జమునానగర్ ప్రాంతంలో గురువారం నాడు ఈ దారుణం జరిగింది. అన్ని గంటలు పబ్‌జీ ఆడకురా అని కుమారుడికి మంచి చెప్పడమే ఆ తండ్రి చేసిన పాపమైంది. నన్నే ఆడుకోవద్దంటావా అంటూ కొడుకు ఉన్మాదిగా మారి తండ్రిపై దాడికి తెగబడ్డాడు. కత్తితో ఆయన గొంతు కోసేశాడు. తండ్రి రక్తంతో తడిసిన దుస్తులతో అలాగే వడివడిగా ఇంట్లోంచి బయటకొచ్చాడు.


అంతటితో ఆగక..తనకు ఎదురు పడ్డ వారందరిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. తాను ఏం చేస్తున్నాడో తెలియన స్థితిలో ఉన్న అతడు తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. ఈ ఘటనలో తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం తండ్రి కొడుకులిద్దరూ మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. పబ్‌జీని ప్రభుత్వం నిషేధించినప్పటికీ అనేక మంది భారత యువత ఇప్పటికీ దీన్ని వదల లేకపోతున్నారు. ఏపీకే ఫైల్స్ సాయంతో దీన్ని మొబైల్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఆటే లోకంగా బతుకుతున్నారు. కొందరు ఉన్మాదులుగా మారిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు.  

Updated Date - 2020-10-19T18:14:32+05:30 IST