ఆసియా బాస్కెట్బాల్ పోటీలకు ప్రీతమ్
ABN , First Publish Date - 2022-08-20T10:53:14+05:30 IST
ఫిబా అండర్-18 ఆసియా బాస్కెట్బాల్ చాంపియన్షి్పలో ఆడనున్న భారత జట్టులో నిజామాబాద్కు చెందిన ఏలేటి ప్రీతమ్ రెడ్డి..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఫిబా అండర్-18 ఆసియా బాస్కెట్బాల్ చాంపియన్షి్పలో ఆడనున్న భారత జట్టులో నిజామాబాద్కు చెందిన ఏలేటి ప్రీతమ్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ కుర్రాడు ప్రీతమే. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఈనెల 21 నుంచి 28 వరకు పోటీలు జరగనున్నాయి. రెండేళ్లుగా అమెరికాలోని ఫ్లోరిడాలో చదువుతున్న 16 ఏళ్ల ప్రీతమ్ అక్కడ బాస్కెట్బాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుని రాటుదేలాడు.