ఆసియా బాస్కెట్‌బాల్‌ పోటీలకు ప్రీతమ్‌

ABN , First Publish Date - 2022-08-20T10:53:14+05:30 IST

ఫిబా అండర్‌-18 ఆసియా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో ఆడనున్న భారత జట్టులో నిజామాబాద్‌కు చెందిన ఏలేటి ప్రీతమ్‌ రెడ్డి..

ఆసియా బాస్కెట్‌బాల్‌ పోటీలకు ప్రీతమ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఫిబా అండర్‌-18 ఆసియా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో ఆడనున్న భారత జట్టులో నిజామాబాద్‌కు చెందిన ఏలేటి ప్రీతమ్‌ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ కుర్రాడు ప్రీతమే. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఈనెల 21 నుంచి 28 వరకు పోటీలు జరగనున్నాయి. రెండేళ్లుగా అమెరికాలోని ఫ్లోరిడాలో చదువుతున్న 16 ఏళ్ల ప్రీతమ్‌ అక్కడ బాస్కెట్‌బాల్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని రాటుదేలాడు.

Updated Date - 2022-08-20T10:53:14+05:30 IST