ఆసియా కప్ హాకీ: భారత్-పాక్ మ్యాచ్ డ్రా
ABN , First Publish Date - 2022-05-24T02:11:59+05:30 IST
జకార్తా: ఆసియా కప్ హాకీ పోటీల్లో భాగంగా ఇండొనేషియా రాజధాని జకార్తాలోని జీబీకే స్టేడియంలో భారత్-పాక్ మధ్య జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.
జకార్తా: ఆసియా కప్ హాకీ పోటీల్లో భాగంగా ఇండొనేషియా రాజధాని జకార్తాలోని జీబీకే స్టేడియంలో భారత్-పాక్ మధ్య జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఆట ప్రారంభమైన ఎనిమిదో నిమిషంలో భారత ఆటగాడు సెల్వమ్ కార్తీ తొలి గోల్ సాధించాడు. కార్తీ తన కెరీర్లోనే తొలి అంతర్జాతీయ గోల్ సాధించాడు. 59వ నిమిషంలో పాకిస్థాన్కు చెందిన అబ్దుల్ రానా పెనాల్టీ కార్నర్ స్ట్రైక్ ద్వారా గోల్ సాధించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది.
మరో మ్యాచ్లో జపాన్ ఆతిథ్య ఇండొనేషియా జట్టును 9-0తో ఓడించింది.