చికిత్స పొందుతూ ఏఎ్‌సఐ మృతి

ABN , First Publish Date - 2020-10-20T07:57:52+05:30 IST

మద్దిపాడు ఏఎ్‌సఐ పూర్ణచంద్రరావు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై ఒంగోలు వెళుతుండగా మండలంలోని వెంకట్రాజుపాలెం వద్ద

చికిత్స పొందుతూ ఏఎ్‌సఐ మృతి

మద్దిపాడు, అక్టోబరు 19: మద్దిపాడు ఏఎ్‌సఐ పూర్ణచంద్రరావు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై ఒంగోలు వెళుతుండగా మండలంలోని వెంకట్రాజుపాలెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆయన మృతి పట్ల రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ ఫిరోజ్‌ ఫాతిమా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావుకు నివాళులర్పిస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2020-10-20T07:57:52+05:30 IST