IPL 2022: ముగిసిన రాజస్థాన్ ఇన్నింగ్స్.. లక్నో ఎదుట భారీ లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-16T02:56:49+05:30 IST
లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల
ముంబై: లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 41 పరుగులు చేయగా, కెప్టెన్ సంజు శాంసన్ 32, దేవదత్ పడిక్కల్ 39, రియాన్ పరాగ్ 19, జేమ్స్ నీషమ్ 14, రవిచంద్రన్ అశ్విన్ 10 పరుగులు చేశారు. చివర్లో ట్రెంట్ బౌల్ట్ 9 బంతుల్లో రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్కు రెండు వికెట్లు దక్కగా అవేశ్ ఖాన్, జాసన్ హోల్డర్, ఆయుష్ బడోనీ చెరో వికెట్ పడగొట్టారు.