పంచగ్రామాల భూ సమస్యపై అశోక్ తన వైఖరి తెలపాలి
ABN , First Publish Date - 2021-06-20T05:42:11+05:30 IST
సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై దేవస్థానం పాలక మండలి చైర్మన్ పూసపాటి అశోక్గజపతిరాజు తన వైఖరిని స్పష్టం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
సింహాచలం, జూన్ 19: సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై దేవస్థానం పాలక మండలి చైర్మన్ పూసపాటి అశోక్గజపతిరాజు తన వైఖరిని స్పష్టం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉందని, ఇందులో భాగంగానే ప్రభుత్వ అభిప్రాయాన్ని, దేవస్థానం నష్ట పరిహారం వంటి పలు అంశాలను కోర్టుకు నివేదించడం జరిగిందన్నారు. ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్న పంచగ్రామాల భూ సమస్యపై అశోక్గజపతిరాజు తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా సహకరించాలన్నారు. గడిచిన ఐదేళ్లలో భీమిలి నియోజవర్గ పరిధిలో 200 ఎకరాలను విక్రయించిన సంగతి వాస్తవామా, కాదా అని ప్రశ్నించారు. అశోక్గజపతిరాజుకు భయపడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదన్నారు. కాగా మంత్రికి ఈవో సూర్యకళ ఆహ్వానం పలకడంతో పాటు దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట ట్రస్టీ సూరిశెట్టి సూరిబాబు, వైసీపీ నాయకులు ఎర్ర వరంబాబు, నడింపల్లి రామరాజు, ఉన్నారు.