వారి మరణాలకు జగన్ రెడ్డే కారణం:అశోక్‌బాబు

ABN , First Publish Date - 2021-09-05T17:55:55+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వారి మరణాలకు జగన్ రెడ్డే కారణం:అశోక్‌బాబు

విజయవాడ: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఎంత మంది వృద్ధులను బలి తీసుకుంటారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. పెన్షన్ దారుల మరణాలకు ముఖ్యమంత్రే కారణమన్నారు. తొలగించిన 3 లక్షల పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వయోవృద్ధులకు పెన్షన్ దూరం చేయడమే జగన్ రెడ్డి సాధించిన ప్రగతి అని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాల వారిని సలహాదారులుగా తీసుకొచ్చి లక్షల్లో జీతాలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. 28 నెలలుగా గుర్తుకురాని అనర్హత ఇప్పుడే గుర్తొచ్చిందా అని నిలదీశారు. పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కొక్కరు రూ.3,250 నష్టపోయారన్నారు. తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించకపోతే ప్రభుత్వం చేతకాని తనాన్ని నడివీధుల్లో ఎండగడతామని అశోక్‌బాబు అన్నారు.

Updated Date - 2021-09-05T17:55:55+05:30 IST