ప్రకాశం పంతులు మనవడికి అవమానం
ABN , First Publish Date - 2022-01-27T05:55:45+05:30 IST
గణ తంత్ర వేడుకల్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణను విస్మ రించారు. ఆయన్ను అవమానిం చారు. ఒంగోలులోని పోలీస్ ప రేడ్గ్రౌండ్లో ఈ ఘటన చో టుచేసుకుంది.
జెండా ఆవిష్కరణ అనంతరం సత్కరించని కలెక్టర్
ఆవేదన వ్యక్తం చేసిన గోపాలకృష్ణ
ఒంగోలు(కలెక్టరేట్) : గణ తంత్ర వేడుకల్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణను విస్మ రించారు. ఆయన్ను అవమానిం చారు. ఒంగోలులోని పోలీస్ ప రేడ్గ్రౌండ్లో ఈ ఘటన చో టుచేసుకుంది. సాధారణంగా క లెక్టర్ జాతీయ జెండా ఆవిష్కర ణ అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్య్ర సమరయోధులను, వారి వారసులను సత్కరి స్తారు. అయితే ఈ పర్యాయం అలా జరగలేదు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ ప్రవీణ్కుమార్ శకటాల ప్రదర్శన, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ల డంతో వెంటనే డీఆర్వో పులి శ్రీనివాసులు వచ్చి గోపాలకృష్ణను శాలువతో సత్కరించా రు. దీనిపై గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వంలో అనేక రకాల సంస్క రణలు వస్తున్నాయన్నారు. అందులో భాగంగా కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసినట్లు గా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.