బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు

ABN , First Publish Date - 2022-01-19T06:53:02+05:30 IST

పేద, బడుగు, బలహీన వర్గాల ఆ శాజ్యోతి స్వర్గీయ ఎన్టీ రామారావు అని టీడీపీ జగిత్యాల జిల్లా ప్రధా న కార్యదర్శి మహంకాళి రాజన్న అన్నారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు
జగిత్యాలలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న

జగిత్యాల టౌన్‌, జనవరి 18: పేద, బడుగు, బలహీన వర్గాల ఆ శాజ్యోతి స్వర్గీయ ఎన్టీ రామారావు అని టీడీపీ జగిత్యాల జిల్లా ప్రధా న కార్యదర్శి మహంకాళి రాజన్న అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ని టవర్‌ సర్కిల్‌లో స్వర్గీయ ఎన్టీ రామారావు 26వ వర్థంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ ఎ న్టీఆర్‌ చేపట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయాయని వివరించారు. తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసి రాముడు, కృష్ణుడు వంటి వివిధ రూపాల్లో, కళా రంగంలో, నాటక రంగంలో చిర స్థాయిగా నిలిచిపోయే పాత్రల్లో నటించారని గుర్తు చేశారు. రూ.2కు కిలో బి య్యం, పక్కా గృహ నిర్మాణం, సగం ధరకు జనతా వస్ర్తాలు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టి న పార్టీ టీడీపీ అని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌, నాయకులు కాశీనాథం, బార్గవరామ్‌, కొండయ్య, రవి గౌడ్‌, మల్లిఖార్జున్‌, గంగాధర్‌, లక్ష్మణ్‌, రవి, తిరుపతి, రాజు, నర్సయ్య, విఠల్‌, హరీష్‌, రాజేందర్‌, విజయ్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-19T06:53:02+05:30 IST