లాక్‌డౌన్‌ పొడిగించొద్దు.. అసద్ ట్వీట్

ABN , First Publish Date - 2021-05-11T23:18:12+05:30 IST

లాక్‌డౌన్‌ 10 రోజుల కంటే ఎక్కువగా పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌లో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలని, లాక్‌డౌన్‌తో చాలా మంది ఉపాధి కోల్పోతారని, జీవనం దుర్భరంగా..

లాక్‌డౌన్‌ పొడిగించొద్దు.. అసద్ ట్వీట్

హైదరాబాద్: లాక్‌డౌన్‌ 10 రోజుల కంటే ఎక్కువగా పెట్టొద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఆయన ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌లో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలని, చాలా మంది ఉపాధి కోల్పోతారని, జీవనం దుర్భరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యే పేదలను గుర్తించాలని ట్విటర్‌లో ఓవైసీ కోరారు. 




ఇదిలా ఉంటే, తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. మూడు గంటలకుపైగా సాగిన సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది.  

Updated Date - 2021-05-11T23:18:12+05:30 IST