కేసీఆర్‌కు ఆర్వింద్‌ లేఖ

ABN , First Publish Date - 2021-09-11T20:43:43+05:30 IST

సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌ లేఖ రాశారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూడు యూనిట్లు తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌కు ఆర్వింద్‌ లేఖ

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌ లేఖ రాశారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూడు యూనిట్లు తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేశారు. 306 మంది కార్మికులు, 55 వేల మంది చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీని విస్మరించడం బాధాకరమని తప్పుబట్టారు. మానతా దృక్పథంతో ఆలోచించి షుగర్‌ ఫ్యాక్టరీ మూడు యూనిట్లు తెరిపించాలని డిమాండ్ చేశారు. కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని లేఖలో ధర్మపురి అర్వింద్‌ కోరారు.

Updated Date - 2021-09-11T20:43:43+05:30 IST