Punjab CM భగవంత్ మాన్‌పై అకాలీదళ్ చీఫ్ బాదల్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-14T15:00:01+05:30 IST

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సంచలన వ్యాఖ్యలు...

Punjab CM భగవంత్ మాన్‌పై అకాలీదళ్ చీఫ్ బాదల్ సంచలన వ్యాఖ్యలు

చండీఘడ్: పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు ఢిల్లీ నుంచి ప్రతి వారం మద్యం పెట్టె పంపుతున్నారని అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.‘‘కేజ్రీవాల్ భగవంత్ మాన్‌కు ప్రతి వారం మద్యం పెట్టె పంపుతున్నాడు,కేజ్రీవాల్ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నడుపుతూ మాన్‌ని తన ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుని ఆనందించమని చెబుతున్నాడు’’ అని బాదల్ చెప్పారు.పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూస్ వాలా ఆప్ ప్రభుత్వం వల్లే మరణించారని సుఖ్‌బీర్ సింగ్ ఆరోపించారు. ‘‘సిద్ధూ భద్రతను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రభుత్వం శత్రువులకు పరోక్ష సాయం చేసింది, అలా అతను మరణించాడు...అరవింద్ కేజ్రీవాల్ తన భద్రతను ఉపసంహరించుకోవాలి’’ అని బాదల్ సూచించారు.


Updated Date - 2022-06-14T15:00:01+05:30 IST