హైకోర్టు చీఫ్‌ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-10-10T22:02:58+05:30 IST

హైకోర్టు చీఫ్‌ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి వీడ్కోలు పలికారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

హైకోర్టు చీఫ్‌ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి వీడ్కోలు

అమరావతి: హైకోర్టు చీఫ్‌ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి వీడ్కోలు పలికారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయవాద వృత్తి క్లిష్టమైన, పలు సవాళ్లతో కూడిందన్నారు. హార్డ్‌వర్క్‌కు మించిన ప్రత్యామ్నయం లేదన్నారు. యువ న్యాయవాదులు సామాజిక న్యాయం భావాలను అర్థం చేసుకోవాలని చెప్పారు. ఏడాదిన్నరకు పైగా కొవిడ్ దృష్ట్యా వర్చువల్ విధానంలో కోర్టులు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలందరికీ న్యాయవ్యవస్థపై అవగాహన కల్పించాలని సూచించారు. లీగల్ లిటరసీని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 

Updated Date - 2021-10-10T22:02:58+05:30 IST