లాక్‌డౌన్‌పై అరుణాచల్‌ సీఎం అయోమయం

ABN , First Publish Date - 2020-04-03T09:17:28+05:30 IST

జనతా కర్ఫ్యూ ఈ నెల 15తో ముగుస్తుందని అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, దానిని కొద్ది నిమిషాల తర్వాత తొలగించారు. అది ట్వీట్‌ చేసిన అధికారికి హిందీ అంతగా తెలియకపోవడం...

లాక్‌డౌన్‌పై అరుణాచల్‌ సీఎం అయోమయం

  • 15తో ముగుస్తుందని ట్వీట్‌
  • వెంటనే తొలగింపు

ఈటానగర్‌, ఏప్రిల్‌ 2: జనతా కర్ఫ్యూ ఈ నెల 15తో ముగుస్తుందని అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, దానిని కొద్ది నిమిషాల తర్వాత తొలగించారు. అది ట్వీట్‌ చేసిన అధికారికి హిందీ అంతగా తెలియకపోవడం వల్ల అలా జరిగిందని, అందుకే దానిని తొలగించామని ఖండూ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత ఇది జరిగింది. లాక్‌డౌన్‌ పొడిగించవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయని, అయితే.. జమాత్‌ సంఘటన తర్వాత విపరీతంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల వల్ల కొన్ని ఆంక్షలు అమలులో ఉండవచ్చని ట్విటర్‌లో ఖండూ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-03T09:17:28+05:30 IST