ప్రధానిని కూడా తప్పుకోవాలని అంటారేమో!
ABN , First Publish Date - 2020-08-05T09:20:10+05:30 IST
దేశవాళీ క్రికెట్ పునరుద్ధరణలో భాగంగా బీసీసీఐ విడుదల చేసిన విధివిధానాలను టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్...
బీసీసీఐ ఎస్ఓపీలపై అరుణ్ లాల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్ పునరుద్ధరణలో భాగంగా బీసీసీఐ విడుదల చేసిన విధివిధానాలను టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్ రంజీ కోచ్ అరుణ్ లాల్ తప్పుబట్టాడు. కరోనా నేపథ్యంలో 60 ఏళ్ల వయసుపైబడిన వారు, అనారోగ్యానికి గురైన వారు, వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నవారిని ట్రైనింగ్ క్యాంప్లకు దూరంగా ఉంచాలని రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ మార్గదర్శకాలు (ఎస్ఓపీలు) విడుదల చేసింది. ఈ విధివిధానాలను 65 ఏళ్ల అరుణ్ లాల్ ప్రశ్నించాడు. ‘ప్రధాని నరేందర్ మోదీ 69 ఏళ్ల వయసులో దేశాన్ని పాలిస్తున్నారు. వీళ్లు చేప్పే దాని ప్రకారం ఆయన కూడా తన పదవి నుంచి తప్పుకోవాలేమో?’ అని అన్నాడు. తాను మాత్రం గదిలో బందీగా ఉండలేనని చెప్పాడు. తాను క్యాన్సర్తో పోరాడి గెలిచాననని అన్నాడు.