వన్డేల్లో అర్ష్‌దీప్‌

ABN , First Publish Date - 2022-07-02T10:05:39+05:30 IST

ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీ్‌సల కోసం జాతీయ సెలెక్టర్లు భారత జట్లను ప్రకటించారు.

వన్డేల్లో అర్ష్‌దీప్‌

 ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు భారత జట్ల ఎంపిక

రోహిత్‌ ఆధ్వర్యంలోనే..

తొలి టీ20కి కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీ్‌సల కోసం జాతీయ సెలెక్టర్లు భారత జట్లను ప్రకటించారు. పేసర్‌ అర్ష్‌దీప్‌ తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అతను జట్టులో ఉన్నా అరంగేట్రం చేయలేకపోయాడు. అయితే పేసర్‌ ఉమ్రాన్‌ను టీ20లకు మాత్రమే ఎంపిక చేశారు. ఇక ఈ రెండు సిరీ్‌సల కోసం రోహిత్‌ ఆధ్వర్యంలోనే భారత జట్లు  బరిలోకి దిగబోతున్నాయి. మరోవైపు మూడు టీ20ల సిరీస్‌ కోసం సెలెక్టర్లు రెండు జట్లను ఎంపిక చేయడం విశేషం.


టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న కోహ్లీ, బుమ్రా, శ్రేయాస్‌, పంత్‌, జడేజాలకు తొలి మ్యాచ్‌కు విశ్రాంతినివ్వడమే దీనికి కారణం. దీంతో రెండు, మూడో టీ20లకు వీరు అందుబాటులో ఉంటారు. ఈనెల 7 నుంచి జరిగే ఈ సిరీ్‌సలో రుతురాజ్‌, శాంసన్‌, త్రిపాఠిలను తొలి మ్యాచ్‌కు మాత్రమే ఎంపిక చేశారు. 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ఆరంభమవుతుంది.


అశ్విన్‌ లేకుండానా? : వాన్‌

ఇంగ్లండ్‌తో టెస్టులో స్పిన్నర్‌ అశ్విన్‌ను ఆడించకపోవడం శోచనీయమని మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అన్నాడు. విదేశాల్లో అద్భుతంగా రాణించే అశ్విన్‌ గతేడాది జరిగిన 4 టెస్టుల్లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. తాజా మ్యాచ్‌లోనూ అతణ్ణి ఎంపికచేయలేదు.


తొలి టీ20కి భారత జట్టు:

రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌, రుతురాజ్‌, శాంసన్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, చాహల్‌, అక్షర్‌, బిష్ణోయ్‌, భువనేశ్వర్‌, హర్షల్‌, అవేశ్‌, అర్ష్‌దీప్‌, ఉమ్రాన్‌. 


రెండు, మూడో టీ20:

రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌, విరాట్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, శ్రేయాస్‌,  పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌, జడేజా, చాహల్‌, అక్షర్‌, బిష్ణోయ్‌, బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్‌, అవేశ్‌, ఉమ్రాన్‌.


వన్డే జట్టు:

రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, ఇషాన్‌, విరాట్‌, సూర్యకుమార్‌, శ్రేయాస్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌, చాహల్‌, అక్షర్‌, బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, షమి, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

Updated Date - 2022-07-02T10:05:39+05:30 IST