నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ రాక

ABN , First Publish Date - 2021-08-06T05:38:05+05:30 IST

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం విశాఖపట్నం వస్తున్నారు.

నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ రాక

విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం విశాఖపట్నం వస్తున్నారు. సాయంత్రం 5.30 గంటలకు నగరానికి చేరుకుని పోర్టు అతిథిగృహంలో బస చేస్తారు. మరుసటిరోజు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళతారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు ముగిశాక 3 గంటలకు బయలుదేరి విశాఖపట్నం వస్తారు. ఇక్కడి నుంచి సాయంత్రం 5.55 గంటలకు ఢిల్లీ వెళతారు. 

Updated Date - 2021-08-06T05:38:05+05:30 IST