నేడు ఇరిగేషన్ మంత్రి రాక
ABN , First Publish Date - 2020-05-31T10:16:16+05:30 IST
నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం జిల్లాకు వస్తున్నారని ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. శ్రీశైలం డ్యాంతో పాటు పోతిరెడ్డిపాడు
కర్నూలు(అగ్రికల్చర్), మే 30: నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం జిల్లాకు వస్తున్నారని ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. శ్రీశైలం డ్యాంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం కలెక్టర్ వీరపాండ్యన్, చీఫ్ ఇంజనీర్ మురళీధర్రెడ్డితో సమావేశమై రాయలసీమ లిఫ్టు స్కీం గురించి చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఏర్పాటుపై ఇటీవల ప్రభుత్వం జీవో 203ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.