ఫుడింగ్ మింక్ పబ్ కేసులో ఇద్దరు అరెస్ట్
ABN , First Publish Date - 2022-04-04T00:43:40+05:30 IST
ఫుడింగ్ మింక్ పబ్ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. అనిల్కుమార్, అభిషేక్ ఉప్పాల అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: ఫుడింగ్ మింక్ పబ్ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. అనిల్కుమార్, అభిషేక్ ఉప్పాల అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. అనిల్ కుమార్ వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 5 కొకైన్ ప్యాకెట్లను సీజ్ చేశామని, కొకైన్ను డ్రింక్లో వేసుకుని తాగినట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. బార్ కౌంటర్లో కూడా డ్రగ్స్ ఉంచి సరఫరా చేశారని చెబుతున్నారు. పబ్లో 100 మంది మద్యం సేవిస్తునట్లు గుర్తించామని, పబ్లోకి వెళ్లడానికి కోడ్ లాంగ్వేజ్ వినియోగించారని తెలిపారు. కోడ్ చెప్పినవాళ్లను మాత్రమే పబ్లోకి నిర్వాహకులు అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.