దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయండి

ABN , First Publish Date - 2021-04-13T05:12:15+05:30 IST

దళితులపై దాడి చేసిన కొత్తకోట ప్రభాకర్‌ను తక్షణం అరెస్టు చేసి దళిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుత్తి కృష్ణ, జోగు గన్నయ్య కోరారు. బావాజీపేట గ్రామాన్ని సోమవారం సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయండి
మాట్లాడుతున్న కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సుత్తి కృష్ణ

బావాజీపేట (జలుమూరు) ఏప్రిల్‌ 12: దళితులపై దాడి చేసిన కొత్తకోట ప్రభాకర్‌ను తక్షణం అరెస్టు చేసి దళిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుత్తి కృష్ణ, జోగు గన్నయ్య కోరారు. బావాజీపేట గ్రామాన్ని సోమవారం సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతనెల 23న  ప్రభాకర్‌ దళిత కుటుంబంపై అన్యాయంగా దాడిచేశాడని, న్యాయం కోసం పోలీసు స్టేషనులో బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి డీఎస్పీ దర్యాప్తుచేపట్టి 20 రోజులైనా నేటికీ బాధ్యులను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు.  కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, కేవీపీఎస్‌ సహాయ కార్యదర్శి దూసి దుర్గారావు,  లింగాల రాజేశ్వరి,  కాళ్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

 



Updated Date - 2021-04-13T05:12:15+05:30 IST