ఏడుగురు మట్కా బీటర్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-07-25T04:50:03+05:30 IST

వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మట్కా జూదానికి పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేసి వారి నుంచి రూ.1.22 లక్షలు నగదు, పట్టీలను స్వాధీనం చేసుకున్నారు.

ఏడుగురు మట్కా బీటర్ల అరెస్టు

ప్రొద్దుటూరు క్రైం, జూలై 24: వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మట్కా జూదానికి పాల్పడుతున్న ఏడుగురిని  పోలీసులు శనివారం అరెస్టు చేసి వారి నుంచి రూ.1.22 లక్షలు నగదు, పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం  వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాద్‌రావు పై వివరాలను వెల్లడించారు. సీఐ నాగరాజుకు రాబడిన సమాచారంతో ఎస్‌ఐ రాజారెడ్డి తన సిబ్బందితో కలిసి ఏడుగురు వ్యక్తులు మట్కాకు పాల్పడుతుండగా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో నడింపల్లెకు చెందిన సయ్యద్‌ ఆలీషేర్‌, ఆర్ట్స్‌ కాలేజీ రోడ్డుకు చెందిన సయ్యద్‌ ఖాదర్‌ అలియాస్‌ కదీర్‌, టీచర్స్‌ కాలనీకి చెందిన షేక్‌ ఖాదర్‌, ఇస్లాంపురం వీధికి చెందిన షేక్‌ నూర్‌బాష, శేషుగారి వీధికి చెందిన దమ్మాల వెంకటచెన్నయ్య, దస్తగిరిపేటకు చెందిన షేక్‌ హుస్సేన్‌, బానగిరి ఆలీబేగ్‌లు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.1.22 లక్షలు నగదు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ నాగరాజు, ఎస్‌ఐ రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T04:50:03+05:30 IST