పేకాటరాయుళ్ల అరెస్ట్
ABN , First Publish Date - 2021-03-21T01:09:04+05:30 IST
రహస్యంగా పేకాటాడుతున్న పలువురు పేకాటరాయుళ్లను
కర్నూలు: రహస్యంగా పేకాటాడుతున్న పలువురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందిందన్నారు. దీంతో అక్కడికి పోలీసులు వెళ్లారన్నారు. గ్రామంలోని హంద్రీనీవా కాలువ సమీపంలో పేకాట ఆడుతున్న 19 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి దాదాపు రూ.7 లక్షలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎవరైనా పేకాట ఆడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.