పేకాటరాయుళ్ల అరెస్ట్‌.. నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-18T17:32:09+05:30 IST

ఓ ఇంట్లో పేకాట కేంద్రాన్ని నడుపుతున్న నిర్వాహకుడిని, పేకాటరాయుళ్లను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, చిక్కడపల్లి లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు

పేకాటరాయుళ్ల అరెస్ట్‌.. నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్/చిక్కడపల్లి: ఓ ఇంట్లో పేకాట కేంద్రాన్ని నడుపుతున్న నిర్వాహకుడిని, పేకాటరాయుళ్లను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, చిక్కడపల్లి లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి ిసీఐ  సంజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రాకరం.. అశోక్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌ హాస్టల్‌లో ఎ. శివారెడ్డి అనే వ్యక్తి   పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.  విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు పర్యవేక్షణలో ిసీఐ ఆర్‌రఘునాథ్‌, ఎస్‌ఐ  నవీన్‌కుమార్‌తోపాటు చిక్కడపల్లి పోలీసులు  మంగళవారం దాడులు  నిర్వహించారు. పేకాట నిర్వాహకుడు శివారెడ్డి, పేకాట ఆడుతున్న వి నాగరాజు, కె రాజ్‌గోపాల్‌, సూర్యగోపి, ఎల్‌ జయపాల్‌రెడ్డి, జె సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకుని వారినుంచి 65550 రూపాయల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2022-05-18T17:32:09+05:30 IST