కోడి పందేల నిర్వాహకుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-13T20:51:09+05:30 IST
జిల్లాలో కోడిపందేల నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్చూరు శివారులో కోడిపందేలు
ప్రకాశం: జిల్లాలో కోడిపందేల నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్చూరు శివారులో కోడిపందేలు అడుతున్నారనే విశ్వసనీయమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు కోడిపందేలపై దాడి చేశారు. కోడిపందేల నిర్వాహకులు పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు కోళ్లు, 48,500 రూపాయల నగదు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.