పందెం రాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-01-14T06:38:02+05:30 IST
శివారుప్రాంతంలో జరుగుతున్న కోడిపందేలపై బుధవారం దాడులు నిర్వహించి ముగ్గురు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ పీవీఎస్ఎస్ఎన్.సురేష్ తెలిపారు.
రాయవరం:
రాయవరం శివారుప్రాంతంలో జరుగుతున్న కోడిపందేలపై బుధవారం దాడులు నిర్వహించి
ముగ్గురు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ
పీవీఎస్ఎస్ఎన్.సురేష్ తెలిపారు. వారి నుంచి రెండు కోళ్లు, రెండు
కత్తులను,రూ.1,450 స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కూర్మాపురం పరిసర
ప్రాంతంలో కోడిపందేలకు యత్నించిన ముగ్గురు పందెం రాయుళ్లను అదుపులోకి
తీసుకుని వారి వద్ద నుంచి రెండుకోళ్లు, రెండు కత్తులు, రూ.960 స్వాధీనం
చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.