మినీ మహానాడు ఏర్పాట్ల పరిశీలన
ABN , First Publish Date - 2022-06-28T05:54:39+05:30 IST
నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు గుడివాడ మినీ మహానాడు ప్రదేశాన్ని సందర్శించారు.
నూజివీడు టౌన్, జూన్ 27: నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు గుడివాడ మినీ మహానాడు ప్రదేశాన్ని సందర్శించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు బచ్చుల అర్జునుడుతో కలిసి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మినీ మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో గుడివాడ టీడీపీ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు పాల్గొనగా నూజివీడు నియోజకవర్గం నుంచి మినీ మహా నాడుకు పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు చర్యలు తీసుకుంటు న్నట్టు కాపా శ్రీనివాసరావు తెలిపారు.