ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2020-10-31T07:15:46+05:30 IST
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించే టీజీ సెట్కు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆది లాబాద్ ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీతులసిదాస్ శుక్రవారం ప్రక టనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11 నుంచి 1 గంటల వరకు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 9 సెంటర్లలో 3,633 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు
జైపూర్, అక్టోబరు 30: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించే టీజీ సెట్కు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆది లాబాద్ ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీతులసిదాస్ శుక్రవారం ప్రక టనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11 నుంచి 1 గంటల వరకు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 9 సెంటర్లలో 3,633 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. హాల్టికెట్లను సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని, ఉదయం 9 గంటలకు మాస్కులు ధరించి సెంటర్కు హాజరు కావాలన్నారు. బ్లూ లేదా బ్లాక్ పెన్, పరీక్ష ప్యాడ్తోపాటు హాల్ టికెట్ తప్ప నిసరిగా తీసుకురావాలని ఆయన తెలిపారు.
లక్షెట్టిపేట: 5వ తరగతి ప్రవేశానికి ఏర్పాట్లు చేసినట్లు గురుకుల ప్రిన్సి పాల్ లలిత కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కున్నారు.
రామకృష్ణాపూర్ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ బివి. ప్రేమారాణి పేర్కొన్నారు. సూపర్బజార్ ఏరియాలో గురుకుల పాఠశాల కేంద్రంలో 360 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు.