పీహెచ్సీలో ఆరోగ్యశ్రీ సేవలు
ABN , First Publish Date - 2022-05-24T05:10:17+05:30 IST
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జూన్ 2వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అమలవుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు పేర్కొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, మే 23: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జూన్ 2వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అమలవుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు పేర్కొన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యా లయంలో వైద్యాధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 53 రకాల వ్యాధులకు సేవలు అందిస్తామన్నారు. ఇందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. రోగులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో ఫయాజ్ఖాన్, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ రాపెల్లి సత్యనారాయణ, డీఈఎంవో బుక్కా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.