ఆరోగ్య మిత్రలను రెగ్యులర్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-08-12T05:49:59+05:30 IST

ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో విధులు బహిష్కరించి డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ఆరోగ్య మిత్రలను రెగ్యులర్‌ చేయాలి
ఆందోళన చేస్తున్న ఆరోగ్య మిత్రలు

ఏలూరు రూరల్‌, ఆగస్టు 11 : ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో విధులు బహిష్కరించి డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎ.నాగబాబు మాట్లాడుతూ పదహారేళ్ళుగా తక్కువ జీతంతో ఆరోగ్య మిత్రలు పని చేస్తున్నారని, వారికి క్యాడర్‌ వన్‌గా పదోన్నతి ఇచ్చి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. గౌరవాధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు మాట్లాడుతూ జగన్‌ పాదయాత్ర సమయంలో ఆరోగ్య మిత్రలను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. సర్వీసు వెయిటేజ్‌ ఇచ్చి జీతభత్యాలు పెంపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి బి.రామ్మోహన్‌, సుశీల, రాధాకుమారి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T05:49:59+05:30 IST