రెండో చార్జిషీటులో అర్నాబ్‌ పేరు

ABN , First Publish Date - 2021-06-23T09:58:03+05:30 IST

నకిలీ టీఆర్పీ కేసులో ముంబై పోలీసులు దాఖలు చేసిన రెండో చార్జిషీటులో సీనియర్‌ జర్నలిస్ట్‌ అర్నాబ్‌ గోస్వామి సహా రిపబ్లిక్‌ గ్రూప్‌కు చెందిన రెండు ఛానళ్లలోని కొందరి ఉద్యోగల పేర్లు చేర్చారు

రెండో చార్జిషీటులో అర్నాబ్‌ పేరు

నకిలీ టీఆర్పీ కేసులో ముంబై పోలీసులు


ముంబై, జూన్‌ 22: నకిలీ టీఆర్పీ కేసులో ముంబై పోలీసులు దాఖలు చేసిన రెండో చార్జిషీటులో సీనియర్‌ జర్నలిస్ట్‌ అర్నాబ్‌ గోస్వామి సహా రిపబ్లిక్‌ గ్రూప్‌కు చెందిన రెండు ఛానళ్లలోని కొందరి ఉద్యోగల పేర్లు చేర్చారు. కేసును దర్యాప్తు చేస్తున్న క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలు చేసిన 1,912 పేజీల చార్జిషీటులో అర్నాబ్‌తోపాటు మహా మూవీ ఛానెల్‌, రిపబ్లిక్‌ న్యూస్‌, రిపబ్లిక్‌ భారత్‌ ఛానళ్లకు చెందిన ఐదుగురు పేర్లను జత చేశారు. నకిలీ టీఆర్పీల కేసు గత ఏడాది అక్టోబర్‌లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-06-23T09:58:03+05:30 IST