హైదరాబాద్: మూతపడనున్న ఆర్మీరోడ్లు
ABN , First Publish Date - 2020-08-13T20:11:07+05:30 IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఆర్మీరోడ్లు మూడు రోజులపాటు మూతపడనున్నాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఆర్మీరోడ్లు మూడు రోజులపాటు మూతపడనున్నాయి. పంద్రాగస్టు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కంటోన్మెంట్లోని పలు ప్రాంతాల్లోని గేట్లు మూసివేస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆ రోడ్లను మూసివేయనున్నట్లు మిలటరీ అధికారులు తెలిపారు.