మోహన్‌బాబును కలిసిన సైనికాధికారులు

ABN , First Publish Date - 2021-07-25T07:10:34+05:30 IST

ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఉగ్రదాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

మోహన్‌బాబును కలిసిన సైనికాధికారులు
మోహన్‌బాబుకు జ్ఞాపిక అందజేస్తున్న సైనికాధికారులు

చంద్రగిరి, జూలై 24: ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఉగ్రదాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన ఇద్దరు పిల్లలకు శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల్లో ఉచితంగా విద్య అందించేందుకు చైర్మన్‌ మోహన్‌బాబు నిర్ణయించారు. ఈ సమాచారం తెలుసుకున్న 18వ రెజిమెంట్‌ (మద్రాసు) అధికారి కల్నల్‌ నరేష్‌ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే విశ్రాంత సైనికాధికారులు బండి పరమేశ్వరరెడ్డి, తిలక్‌ యాదవ్‌, రమేష్‌ శనివారం మోహన్‌బాబుకు జ్ఞాపికను అందజేసి అభినందించారు.  దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబానికి అండగా నిలవడం దేవుడు తమకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - 2021-07-25T07:10:34+05:30 IST