పాక్ సరిహద్దులో 3 వేల అదనపు బలగాల మోహరింపు

ABN , First Publish Date - 2020-09-20T01:28:43+05:30 IST

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు నియంత్రణ రేఖ వద్ద భారత ఆర్మీ 3 వేల అదనపు బలగాలను

పాక్ సరిహద్దులో 3 వేల అదనపు బలగాల మోహరింపు

కశ్మీర్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు నియంత్రణ రేఖ వద్ద భారత ఆర్మీ 3 వేల అదనపు బలగాలను మోహరించింది. కశ్మీర్ ప్రాంతంలోని ఎల్ఓసీ వద్ద అదనపు బలగాలను మోహరించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు బలగాలు చొరబాట్లను భగ్నం చేయడంతోపాటు ఉగ్రవాదులు సరిహద్దు దాటకుండా విజయవంతంగా అడ్డుకుంటున్నట్టు పేర్కొన్నాయి. ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్‌లో ఇటీవల చొరబాటు ప్రయత్నాలను ఆర్మీ అడ్డుకుంది. 


పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద రెండు పాక్ ఆర్మీ బలగాలు ఉన్నాయని పేర్కొన్న వర్గాలు.. చైనాకు మద్దతుగా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే అవి అక్కడ ఉన్నాయని మాత్రం చెప్పలేమని స్పష్టం చేశాయి. పాకిస్థాన్ వైపు నుంచి కాల్పుల ఉల్లంఘనలు పెరగడంతో ఆర్మీ చీప్ ఎంఎం నవరణే ఇటీవల శ్రీనగర్ సందర్శించి భద్రతపై సమీక్షించారు.   


Updated Date - 2020-09-20T01:28:43+05:30 IST