Manoj Pandey: రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి
ABN , First Publish Date - 2022-08-14T13:45:47+05:30 IST
రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే(Army Chief General
- ఆర్మీ చీఫ్ మనోజ్పాండే
చెన్నై, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే(Army Chief General Manoj Pandey) పేర్కొన్నారు. శనివారం నగరంలోని మిలటరీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. దక్షిణ భారత ఏరియా కమాండింగ్ లెఫ్ట్నెంట్ జనరల్ ఎ.అరుణ్(A. Arun) ఆర్మీ చీఫ్కు సాదర స్వాగతం పలకడంతో పాటు కేంద్రంలోని విశేషాలను వివరించారు. కేంద్రం నుంచి చేస్తున్న మానవతా సాయం, విపత్తు సహాయ విధుల కోసం సంసిద్ధంగా వున్న ఏర్పాట్లను కూడా ఆయన వివరించారు. సైనిక కేంద్రంలోని ఉన్నతాధికారులను పరిచయం చేశారు. మారుతున్న ఆధునిక యుద్ధం గతిశీలతను, స్వదేశీకరణ ఆవశ్యకతను ఈ సందర్భంగా మనోజ్పాండే ప్రస్తావించారు. అదే విధంగా అగ్నిపథ్ పథకం వల్ల భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలనూ వివరించారు. సైనిక కేంద్రం కార్యకలాపాలను ఆర్మీ చీఫ్ ప్రత్యేకంగా అభినందించారు.