jammu kashmir: అడవుల్లో ఉగ్రవాదుల డంప్ స్వాధీనం
ABN , First Publish Date - 2021-09-01T17:35:16+05:30 IST
జమ్మూకశ్మీరులోని అడవుల్లో ఉగ్రవాదులు దాచి పెట్టిన ఆయుధాల డంప్ ను సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు బుధవారం స్వాధీనం చేసుకుంది...
గండేర్బల్ : జమ్మూకశ్మీరులోని అడవుల్లో ఉగ్రవాదులు దాచి పెట్టిన ఆయుధాల డంప్ ను సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు బుధవారం స్వాధీనం చేసుకుంది. గండేర్ బల్ జిల్లాలోని సద్రా బాగ్ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు ఆయుధాలను దాచి ఉంచారు. సీఆర్ పీఎఫ్ జవాన్లు సద్రాబాగ్ అడవుల్లో గాలిస్తుండగా ఉగ్రవాదుల డంప్ కనిపించింది. సంద్రాబాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఆయుధాల డంప్ నుంచి ఏకే -47 రౌండ్లు, రెండు మాగజైన్స్, 9 ఎంఎం రౌండ్లు, హ్యాండ్ గ్రెనెడ్లను స్వాధీనం చేసుకున్నామని సీఆర్ పీఎఫ్ అధికారి ట్వీట్ చేశారు. గండేర్ బల్ పోలీసులతో కలిసి అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా ఉగ్రవాదుల డంప్ కనిపించిందని చెప్పారు.