కుమరం భీం వర్ధంతికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T03:56:00+05:30 IST

భీం వర్ధంతికి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జోడేఘాట్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కుమరం భీం వర్ధంతికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జడ్పీ చైర్‌పర్సన్‌తో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి

కెరమెరి, అక్టోబరు 7: భీం వర్ధంతికి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జోడేఘాట్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భీం వర్ధంతికి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ రానున్న నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలన్నారు. అన్ని బేస్‌క్యాంపుల నుంచి ఆర్టీసీ బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులు చూడాలన్నారు. భోజనాలు, తాగునీరు, మూత్రశా లలు అన్నిఏర్పాట్లను అధికారులు దగ్గరుండి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ ధ్రుపతాబాయి, తహసీల్దార్‌ సాయన్న, ఎంపీ డీవో సత్యనారాయణ గౌడ్‌, ఎంపీవో సుదర్శణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T03:56:00+05:30 IST