పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-22T05:52:01+05:30 IST

ఈ నెల 23 నుంచి జూన్‌ ఒకటోతేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి కల్చరల్‌, మే 21: ఈ నెల 23 నుంచి జూన్‌ ఒకటోతేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 49  పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశామని, ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ కెమెరాలు  ఏర్పాటు చేశామన్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు 9.35 నిమిషాల తర్వాత వస్తే  అనుమతించమని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రతీ రోజు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు సెల్‌ ఫోన్‌, క్యాలిక్యులేటర్‌, స్మార్ట్‌ వాచ్‌ తో పాటు ఎలాంటి ఎలకా్ట్రనిక్‌ వస్తువులు తీసుకురావద్దన్నారు. హాల్‌టికెట్లను ఇంటర్‌ నెట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని, జవాబు పత్రంలో ఎక్కడా తిహాల్‌ టిక్కెట్‌ నంబర్‌ రాయకూడదని, ఓఎంఆర్‌ షీట్‌లోనే అన్ని వివరాలు ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన అనుమానాలు ఫిర్యాదులు ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నంబర్‌ 08728-221142కు కాల్‌ చేయాలని సూచించారు. 


Updated Date - 2022-05-22T05:52:01+05:30 IST