సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-07-06T05:45:03+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్‌ వేంపల్లె పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌ అధికారులను ఆదేశించారు. 7, 8 తేదీల్లో సీఎం జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్‌, ఎస్పీతో పాటు ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర అధికారులు పర్యటించారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఓఎస్డీ

వేంపల్లె, ఇడుపులపాయలో పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

వేంపల్లె, జూలై 5: సీఎం వైఎస్‌ జగన్‌ వేంపల్లె పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌ అధికారులను ఆదేశించారు. 7, 8 తేదీల్లో సీఎం జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్‌, ఎస్పీతో పాటు ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర అధికారులు పర్యటించారు. వేంపల్లెలో సుమారు రూ.15కోట్ల వ్యయంతో నిర్మించనున్న పార్కు, జడ్పీ బాలుర, బాలికల హైస్కూల్‌ నూతన భవనాల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. మొదట కడప బైపా్‌సరోడ్డులో హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. ప్రారంభోత్సవాలకు, ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌, ఎస్పీలు ఆదేశించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ సీతారామిరెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:45:03+05:30 IST