పోలింగ్‌ ఏర్పాట్లు పకడ్బందీగా చేయండి: జేసీ

ABN , First Publish Date - 2021-02-25T05:00:12+05:30 IST

పురపాలక ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ ఆదేశించారు. రామతీర్థం జంక్షన్‌ ప్రాఽథమికోన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు.

పోలింగ్‌ ఏర్పాట్లు పకడ్బందీగా చేయండి: జేసీ
గురుకుల పాఠశాలలో అధికారులతో మాట్లాడుతున్న జేసీ

నెల్లిమర్ల,    ఫిబ్రవరి 24 : పురపాలక ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ ఆదేశించారు. రామతీర్థం జంక్షన్‌ ప్రాఽథమికోన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఆ పాఠశాలలో ఐదు పోలింగ్‌ కేంద్రాల ఉన్న దృష్ట్యా 9వ వార్డుకు సంబంధించిన కొన్ని కేంద్రాలను ఫ్లైఓవర్‌ వంతెన వద్ద ఉన్న సీకేఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాల్లోనికి మార్చాలని సూచించారు.    పోలింగ్‌ సామగ్రి అందజేత, బ్యాలెట్లు భద్రపరిచే స్ర్టాంగ్‌ రూమ్‌ కేంద్రం ఏర్పాటు కానున్న జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలనూ ఆయన పరిశీలించారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిషనర్‌  రామప్పలనాయుడు, తహసీల్దార్‌ రాము, డీటీ శైలజ, జేఈ కిరణ్‌కుమార్‌, ఎస్‌ఐ దామోదరరావు, పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-02-25T05:00:12+05:30 IST