ముగ్గురు బైక్ దొంగల అరె స్టు
ABN , First Publish Date - 2022-06-25T05:31:51+05:30 IST
ముగ్గురు బైక్ దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ రాజశేఖర్ పేర్కొన్నారు.
బెల్లంకొండ, జూన్24: ముగ్గురు బైక్ దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెల్లంకొండ క్రాస్రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానితులు.. గుంటూరు పట్టణానికి చెందిన గంగుల సాంబశివరావు, బెల్లంకొండ మండలం పాపాయిపాలెం గ్రామానికి చెందిన గంగుల గోపి, క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన దేవరకొండ అచ్చయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా వారు 9చోట్ల బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. సమావేశంలో హెడ్కానిస్టేబుల్ హుస్సేన్, సిబ్బంది నారాయణ, హనుమంతరావు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.