Pune వెళుతున్నారా? విమాన ప్రయాణీకులు 14 రోజులు ఆగాల్సిందే...
ABN , First Publish Date - 2021-10-16T16:54:23+05:30 IST
మహారాష్ట్రలోని పుణే నగరానికి విమానంలో వెళ్ళాలనుకునేవారు
పుణే : మహారాష్ట్రలోని పుణే నగరానికి విమానంలో వెళ్ళాలనుకునేవారు 14 రోజులు ఆగాలి. ఎందుకంటే రన్వే మరమ్మతు పనుల కోసం ఈ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ పనులను భారత వాయు సేన (ఐఏఎఫ్) అక్టోబరు 16 నుంచి ప్రారంభిస్తోంది. అందువల్ల అక్టోబరు 16 నుంచి 29 వరకు ఈ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశారు.
భారత వాయు సేన నుంచి అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుణే విమానాశ్రయం అధికారులు చెప్పారు. పుణే విమానాశ్రయం అధికారిక ట్విటర్ హ్యాండిల్లో కూడా ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
పుణే విమానాశ్రయం ఐఏఎఫ్కు చెందిన లొహెగావ్ ఎయిర్బేస్లో భాగం. ఈ రన్వేను మరమ్మతు చేయాలని ఏప్రిల్లో ప్రతిపాదించారు.