తెలంగాణ పథకాలు బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నాయా?: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-03-08T08:43:07+05:30 IST
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో ఏ ఒక్కటైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని మంత్రి ఎర్రబెల్లి దయాకరావు ప్రశ్నించారు.
నర్సంపేట టౌన్, మార్చి 7: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో ఏ ఒక్కటైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని మంత్రి ఎర్రబెల్లి దయాకరావు ప్రశ్నించారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని ద్వారకాపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీల గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ నేతలకు బుద్ధి చెపాలన్నారు.