కౌలురైతు బలవన్మరణంపై ఆర్డీవో విచారణ
ABN , First Publish Date - 2021-01-19T05:27:56+05:30 IST
కొద్దిరోజుల క్రితం అప్పుల బాధతో మరణించిన జామి గ్రామానికి చెందిన రైతు పిల్లా ఎర్నాయుడు మృతిపై విజయనగరం ఆర్డీవో భవానీశంకర్ సోమవారం విచారణ నిర్వహించారు.
శృంగవరపుకోట రూరల్ (జామి) జనవరి 18: కొద్దిరోజుల క్రితం అప్పుల బాధతో మరణించిన జామి గ్రామానికి చెందిన రైతు పిల్లా ఎర్నాయుడు మృతిపై విజయనగరం ఆర్డీవో భవానీశంకర్ సోమవారం విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుడి తల్లినుంచి పలు వివరాలు సేకరించారు. ఎవరివద్ద కౌలుచేశారు, అప్పులు ఎంత ఉన్నాయి అనే విషయాలను తెలుసుకున్నారు. విచారణ అనంతరం నివేదికను తమ ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. డీఎస్పీ అనిల్పులిపాటి, తహసీల్దార్ రమణరావు, ఎస్ఐ సుదర్శన్, వ్యవసాయశాఖ ఏడీఏ విజయ, ఏవో కిరణ్కుమార్ ఉన్నారు.