క్వార్టర్స్ చేరిన ఆర్చర్లు
ABN , First Publish Date - 2021-04-22T09:34:07+05:30 IST
క్వార్టర్స్ చేరిన ఆర్చర్లు
గ్వాటెమెలా సిటీ: ఆర్చరీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్లలో సత్తాచాటిన భారత ఆర్చర్లు మూడు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దీపికా కుమారి, అంకితా భకత్, కోమలిక త్రయం క్వాలిఫయింగ్ రౌండ్లో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్కు అర్హత సాధించింది. పురుషుల రికర్వ్ టీమ్ మూడో స్థానంలో నిలిచి క్వార్టర్స్కు చేరింది. వ్యక్తిగత విభాగంలోనూ అతాను దాస్ క్వార్టర్స్ బెర్త్ దక్కించుకొన్నాడు.