ఆదిత్యునికి లక్షపూలతో అర్చన
ABN , First Publish Date - 2022-01-29T05:20:32+05:30 IST
ఆదిత్యునికి లక్షపూలతో అర్చన
అరసవల్లి, జనవరి 28: పుష్యబహుళ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం సూర్యనా రాయణస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ముం దుగా ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు లక్ష పూలతో అర్చన నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులను అనుమతించలేదు. కార్యక్రమంలో ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్, చెట్టు నాగేశ్వర్రావు దంపతులు, దేవరశెట్టి షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.