పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-01-18T18:22:35+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

మొహాలీ : పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. ప్రజాభిప్రాయాన్ని బట్టి ఆయనను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఫోన్, వాట్సాప్ ద్వారా తెలియజేశారని, భగవంత్ మాన్‌కు 93.3 శాతం మంది మద్దతు పలికారని చెప్పారు. 


పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను ముఖ్యమంత్రిగా చూడాలని 3 శాతం మంది కోరుకున్నట్లు తెలిపారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని స్పష్టమైపోయిందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనవారే తదుపరి పంజాబ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. 


భగవంత్ మాన్


 2014 మార్చిలో ఆప్‌లో చేరారు. 2014, 2019లలో సంగ్రూర్ నియోజక వర్గం నుంచి ఆప్ లోక్‌సభ సభ్యునిగా గెలిచారు. 



ప్రస్తుతం పంజాబ్ ఆప్ కన్వీనర్‌గా ఉన్నారు. 


2011లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2012లో లెహ్రా నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. వృత్తి రీత్యా ఆయన నటుడు, కమెడియన్. 


Updated Date - 2022-01-18T18:22:35+05:30 IST