రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN , First Publish Date - 2022-04-04T04:50:14+05:30 IST

ద్విచక్రవాహనా న్ని లారీ ఢీకొనడంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెందగా ఒకరు గాయాలపాలైన సంఘటన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి

 మరొకరికి తీవ్ర గాయాలు 

 కానిస్టేబుల్‌ స్వగ్రామంలో విషాదం

లక్ష్మిదేవిపల్లి/అన్నపురెడ్డిపల్లి, ఏప్రిల్‌ 3: ద్విచక్రవాహనా న్ని లారీ ఢీకొనడంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెందగా ఒకరు గాయాలపాలైన సంఘటన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ బైపాస్‌ రోడ్డు నుంచి ఏఆర్‌ కానిస్టేబుల్‌ బత్తుల బాలాజీ (33), సహచరుడు సతీష్‌తో పాత కొత్తగూడెం నుంచి పాల్వంచకు వెళ్లే బైపాస్‌ రోడ్డులో  కొత్తగూడెం వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన సతీష్‌ను కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మిదేవిపల్లి ఎస్‌ఐ హారిక కేసు నమోదు చేసి లారీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

గ్రామంలో విషాదం

అన్నపురెడ్డిపల్లి: చాతకొండ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన  ఏఆర్‌ కానిస్టేబుల్‌ బత్తుల బాలాజీ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికై పలువురి మన్ననలు పోంది ఆదర్శంగా నిలిచారు. కుటుంబ సభ్యులు రోదనను చూసిన ప్రతి ఓక్కరు కన్నిరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి బార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు.


Updated Date - 2022-04-04T04:50:14+05:30 IST